Mallu Bhatti Vikramarka : కేసీఆర్ పై భట్టి గరం గరం
పని చేయని సీఎం ఎందుకు
Mallu Bhatti Vikramarka : హైదరాబాద్ – సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క షాకింగ్ కామెంట్స్ చేశారు. పని చేసే సీఎం కావాలా రాష్ట్రానికి లేక ఫార్మ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కావాలా అనేది ప్రజలు తేల్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. కేవలం సంక్షేమ పథకాల పేరుతో జనం చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Mallu Bhatti Vikramarka Slams CM KCR
త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka). మాయ మాటలతో బురిడీ కొట్టిస్తున్న కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. ఇకనైనా ప్రజలు మేలుకోవాలని లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మల్లు భట్టి విక్రమార్క.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఇవాళ ధరణి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పక నెరవేరుస్తామని, అందుకే తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు. దీంతో బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోందని ఆవేదన చెందారు.
Also Read : PM Modi Posters : మోదీ పోస్టర్స్ కలకలం