Tummala Nageswara Rao : కోట్లు కుమ్మ‌రించినా కారు పంక్చ‌రే

మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు

Tummala Nageswara Rao : ఖ‌మ్మం జిల్లా – మాజీ మంత్రి, ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాష్ట్రంలో కొలువు తీరిన గులాబీ పార్టీని ఏకి పారేశారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లతో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు(Tummala Nageswara Rao) ప్ర‌సంగించారు. కొన్ని స‌ర్వేలు త‌ప్ప చాలా స‌ర్వేల‌న్నీగంప గుత్త‌గా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయ‌ని చెప్పాయ‌ని తెలిపారు.

Tummala Nageswara Rao Shocking Comments on BRS Party

ఇందులో ఎలాంటి అనుమానం లేద‌ని మొత్తం 119 సీట్ల‌కు గాను కాంగ్రెస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వ‌స్తాయ‌ని , ఇక బీఆర్ఎస్ పత‌నం ప్రారంభ‌మైంద‌ని ఆ పార్టీకి క‌నీసం 30 సీట్లు కూడా వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేద‌న్నారు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు.

ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న మాజీఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఏ క‌ష్టం వ‌చ్చిన ఆయ‌న మిమ్మ‌ల్ని ఆదుకుంటాడ‌ని అన్నారు. బీఆర్ఎస్ వేల కోట్లు ఖ‌ర్చు చేసినా జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ప్ర‌జ‌లు ఆల్ రెడీ డిసైడ్ అయ్యార‌ని, కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఇచ్చేందుకు సిద్ద‌మై ఉన్నార‌ని ఇక ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌ర‌గాల్సి ఉంద‌న్నారు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు.

కోట్లు కుమ్మ‌రించినా, మ‌ద్యం పేరుతో ప్ర‌లోభాల‌కు గురి చేసినా చివ‌ర‌కు బీఆర్ఎస్ కారు పంక్చ‌ర్ కావ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : Kicchennagari Laxma Reddy : స‌బిత‌మ్మ ఓట‌మి ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!