Vijaya Shanti : బీఆర్ఎస్ న‌జ‌రానా బీజేపీ దోస్తానా

నిప్పులు చెరిగిన విజ‌య శాంతి

Vijaya Shanti : హైద‌రాబాద్ – మాజీ ఎంపీ విజ‌య శాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను పార్టీ మారారంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. నేను నేటి దాకా ప్ర‌జ‌ల ప‌క్షంగా ఉన్నాన‌ని, వారి త‌ర‌పున త‌న గొంతుక ఇచ్చానని స్ప‌ష్టం చేశారు.

Vijaya Shanti Comment

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో గత 7 సంవ‌త్స‌రాలుగా జెండా మోసి కొట్లాడ‌న‌ని పేర్కొన్నారు విజ‌య శాంతి. ఆనాడు ఎంపీలుగా ఉన్న బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి బీఆర్ఎస్ స‌ర్కార్ పై చ‌ర్య‌లు ఉంటాయ‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు. వాటిని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

త‌న‌ను న‌మ్మించి మోసం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు విజ‌య శాంతి(Vijaya Shanti). మీరంతా స‌మ‌ర్థిస్తే ఎలాగైనా ర‌సే కేసీఆర్ పై , కుటుంబంపై చ‌ర్య‌లు ఉంటాయంటూ చెప్పింది మీరు కాదా అని నిల‌దీశారు. త‌న‌తో పాటు వివేక్ వెంక‌ట స్వామి, రాజ‌గోపాల్ రెడ్డి, విశ్వే శ్వ‌ర్ రెడ్డిల‌ను చేర్చుకున్న‌ది నిజం కాదా అని మండిప‌డ్డారు రాముల‌మ్మ‌.

ఇవాళ రాష్ట్రంలో బీజేపీ ప‌నై పోయింద‌న్నారు. ఆ పార్టీ కేసీఆర్ క‌నుస‌న్న‌ల‌లో కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్, బీజేపీల‌కు చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌న్నారు విజ‌య శాంతి.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Leave A Reply

Your Email Id will not be published!