Eatala Rajender : దోపిడీకి చిరునామా బీఆర్ఎస్ పాలన
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కామెంట్
Eatala Rajender : తెలంగాణ – అవినీతికి , అక్రమాలకు కేరాఫ్ బీఆర్ఎస్ పాలన అని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. బీజేపీ నిర్ణయాత్మక శక్తి కాబోతోందన్నారు . నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత వాటిని మరిచి పోయాడని ఆరోపించారు.
Eatala Rajender Slams BRS Govt
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు ఈటల రాజేందర్(Eatala Rajender). ప్రస్తుతం బీఆర్ఎస్ తో పోటీ పడుతున్న చరిత్ర తమ బీజేపీకి ఉందన్నారు .
చాలా చోట్ల కమలం జెండాలు ఎగురడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆయా రాజకీయ పార్టీలు ఇంత కాలం మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని కానీ తాము మాత్రం రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఇప్పటికే కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ద్విముఖ పోటీ లేదని త్రిముఖ పోటీ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ లో తన చేతిలో సీఎం కేసీఆర్ ఓడి పోవడం ఖాయమన్నారు. ఇక కామారెడ్డిలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఈటల రాజేందర్.
Also Read : Harish Rao : కమలం..హస్తంకు డిపాజిట్లు రావు