RS Praveen Kumar : జగదీశ్ రెడ్డి ప్రోద్భలంతోనే దాడి
నిప్పులు చెరిగిర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ
RS Praveen Kumar : హైదరాబాద్ – సూర్యాపేటలో తమ పార్టీకి చెందిన అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ పై మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆవేదన చెందారు. చివరకు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అభ్యర్థి డ్రైవర్ వద్ద నుండి రూ. 25 వేలు దొంగిలించానంటూ తనతో పాటు తన కొడుకు పై కూడా పోలీసులు చిల్లర కేసు పెట్టారని ఆరోపించారు ఆర్ఎస్పీ.
RS Praveen Kumar Comments on Jagadeesh Reddy
రాష్ట్రంలో పేదలు, బహుజనులు, మైనార్టీలు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇవాళ సూర్యాపేటలో తను గెలవలేనని తెలుసుకుని బలమైన గొంతుకగా ఉన్న వట్టె జానెయ్య యాదవ్ ను చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. ఈ విషయం గురించి ముందే తాను ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చానని ఈ సందర్భంగా చెప్పారు ఆర్ఎస్పీ.
మంత్రి సపోర్ట్ తో అనుచరులు విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇన్ని దాడులు జరుగుతుంటే ఎందుకు సీఈసీ మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఆర్ఎస్పీ.
Also Read : PM Modi : దేశం గర్వించేలా ఆడారు – మోదీ