Congress Leaders: మహిళా ఎస్ఐతో కాంగ్రెస్ నాయకులు అనుచిత ప్రవర్తన
మహిళా ఎస్ఐతో కాంగ్రెస్ నాయకులు అనుచిత ప్రవర్తన
Congress : ఖమ్మం జిల్లాలో ఓ మహిళా ఎస్సైపై కాంగ్రెస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖమ్మంలోని కల్లూరు ఎన్ఎస్పీలోని ఓ హోటల్ వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై కాగ్రెస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారు. ఆమె బాడీపై చేయి వేసి పక్కకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… రంగంలోనికి దిగిన పోలీసులు… నిందితుడిని, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
ఖమ్మంలోని కల్లూరు ఎన్ఎస్పీలోని ఓ హోటల్ వద్ద తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్(Congress) నేతలకు, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్ఐ హరిత.. హోటల్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు ఆమె.. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ నాయకుడు రాము… విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. మహిళా అని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేశారు. దీనితో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. అయితే కాంగ్రెస్ నాయకులు… మహిళా ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనితో అప్రమత్తమైన పోలీసులు… ఎస్ఐపై దాడి చేసిన రాముతో పాటుగా అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
Congress – విషమంగానే ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్(BRS) నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. గురువారం ఆయన ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం… సీపీఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా… ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోందన్నారు. మంత్రి శ్రీధర్బాబు ఆసుపత్రిలో గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోపీనాథ్ తనకు సన్నిహితుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తోడుగా ఆసుపత్రిలో కేటీఆర్ సతీమణి శైలిమ ఉన్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని ఆమె ఎప్పటికప్పుడు కేటీఆర్కు తెలియజేస్తున్నారు.
Also Read : PM Narendra Modi: ‘జీ 7’ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీకి ఆహ్వానం