Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య ! హిండన్ ఎయిర్ పోర్ట్ లో నిలిపివేత !

ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య ! హిండన్ ఎయిర్ పోర్ట్ లో నిలిపివేత !

Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఒక ప్రక్క సహాయక చర్యలు కొనసాగుతుండా… మరోవైపు ఎయిరిండియా ఆధ్వర్యంలో నడుస్తున్న డ్రీమ్ లైనర్ విమానాల్లో ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగా… మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి కోల్‌కతా బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Air India Updates

షెడ్యూల్‌ ప్రకారం ఎయిరిండియాకు (Air India) చెందిన ఎయిరిండియా IX 1511 విమానం ఆదివారం (జూన్‌15)న ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌ లోని హిండన్ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు బయల్దేరాల్సి ఉంది. అయితే,ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్‌ అవ్వాల్సి ఉండగా… సాంకేతిక సమస్య తలెత్తింది. దీనితో అప్రమత్తమైన పైలెట్‌ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపంపై సమాచారం అందుకున్న ఇంజినీర్లు విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించే పనిలోపడ్డారు. ఫలితంగా, భద్రతా కారణాల దృష్ట్యా టేకాఫ్ వాయిదా పడింది. దీనితో మిగిలన విమాన కార్యకలాపాలపై అంతరాయం ఏర్పడింది. దీనితో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు.

Also Read : British Fighter Jet: బ్రిటన్‌ ఫైటర్‌ జెట్‌ కేరళలో అత్యవసర ల్యాండింగ్‌

Leave A Reply

Your Email Id will not be published!