హైదరాబాద్ : దమ్మున్న డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. అయితే ఈ మూవీ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో భాగంగా ఉండడం వల్ల దర్శకుడికి ఎక్కువ సమయం కేటాయించ లేక పోయాడు. దీంతో ఈ సినిమా వస్తుందా రాదా అన్న అనుమానం కూడా వ్యక్తం అయ్యింది ఒకానొక సమయంలో. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు, మీమ్స్, పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. తాజాగా దేఖ్ లేంగే సాలా అన్న సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
ఇదిలా ఉండగా ఈ పాటను దేవిశ్రీ తన తండ్రి, దివంగత సత్యానంద్ కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవ్ మెంట్స్ కు అనుగుణంగా పాటను చిత్రీకరించే ప్రయత్నం చేశాడు హరీశ్ శంకర్. తను గతంలో పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు దర్శకుడు. అదే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లేలా చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి కీలకమైన అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను కైవసం చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి. చివరకు అమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు టేకోవర్ చేసుకున్నట్లు టాక్.
