హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరోసారి నోరు విప్పారు. ఆయన ఏబీఎన్ రాధాకృష్ణపై భగ్గుమన్నారు. శనివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణి టెండర్ల రద్దుపై స్పందించారు. ఈ సందర్బంగా ఆయన నిప్పులు చెరిగారు రాధాకృష్ణ. ఆధారాలు లేకుండా ఎలా దుష్ప్రచారం చేస్తారంటూ ప్రశ్నించారు. ఇలాగే నువ్వు గీత దాటితే పరువు నష్టం దావా వేసేందుకు సైతం తాను వెనుకాడబోనంటూ స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ తొలి పలుకుల నినాదం వెనుక ఎవరి హస్తం ఉందో తానే చెప్పాలన్నారు. ఏ రాబందులా? ఏ గద్దల? ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు ప్రసారం చేశారనేది తేలాల్సి ఉందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తిపై ఇలాంటి దుష్ప్రచారాలకు తావు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగా నిలిచిన సింగరేణి సంస్థపై పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలతో రాధాకృష్ణ చేస్తున్న తొలి పలుకు కథనాలు సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతా రాహిత్య చర్యలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియాకు కూడా హద్దు అనేది ఉంటుందన్నారు. దానిని గమనించి నడుచు కోవాలని హితవు పలికారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
