ఏం ఉద్దరించారని సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలి..?
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై భగ్గుమన్న ఓవైసీ
న్యూఢిల్లీ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. మరాఠా వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరం సందర్బంగా నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర సావర్కర్ కు కేంద్ర సర్కార్ భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని వల్ల ఆ అవార్డుకు మరింత గౌరవం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర సమయంలో నిస్వార్థంగా పోరాటం చేసిన మహాత్మా గాంధీని చంపిన చరిత్ర ఆర్ఎస్ఎస్ దని , దీనిని తయారు చేసిన సావర్కర్ కు ఎందుకు అత్యున్నతమైన పురస్కారం ఇవ్వాలని ప్రశ్నించారు ఓవైసీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
1857 తిరుగుబాటుకు చేసిన సేవలకు ప్రసిద్ధి చెందిన మౌల్వీ అల్లావుద్దీన్ను ప్రస్తావించారు. సావర్కర్కు అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేయాలనే ఆలోచనను ఓవైసీ విమర్శించారు. హైదరాబాద్లోని మక్కా మసీదుకు అప్పటి ఇమామ్ అయిన మౌల్వీ అల్లావుద్దీన్, ఔరంగాబాద్లో కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులను పట్టుకున్నప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని గుర్తు చేశారు ఓవైసీ. బ్రిటిష్ వారి రక్షణలో ఉన్న నిజాంలు (హైదరాబాద్ను) పరిపాలించారు. అతనిపై దాడి జరిగింది, కానీ అతను తప్పించుకున్నాడు. తర్వాత, అతన్ని అరెస్టు చేశారు. మౌలానా అల్లావుద్దీన్ జైలులోనే మరణించారని తెలిపారు. ఈ రోజు, ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి ఆరు క్షమాభిక్ష పిటిషన్లు రాసిన వ్యక్తికి భారతరత్న ప్రదానం చేయాలని అనుకోవడం దారుణమన్నారు. ఒక పని చేస్తే గాడ్సేకు ఆ పురస్కారం ఇస్తే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు.