హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు దేశంలోని 100 మంది టాప్ కలెక్టర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన “ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ సర్వే 2026” భారతదేశంలోని టాప్ 100 జిల్లా కలెక్టర్ల జాబితాలో ఐఏఎస్ లు దాసరి హరి చందన, సి. నారాయణ రెడ్డి, మిక్కిలినేని మను చౌదరి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దేశ వ్యాప్తంగా దాదాపు 800 జిల్లాల కలెక్టర్ల నుండి ఎంపికైన వీరి చేరిక, వినూత్న పాలన, ప్రజా సేవ, పరిపాలనా నైపుణ్యంలో తెలంగాణకు పెరుగుతున్న ఖ్యాతిని ప్రతిబింబిస్తుంది.
ఫేమ్ ఇండియా మ్యాగజైన్, ఏషియా పోస్ట్తో కలిసి నిర్వహించిన ఈ సర్వే ప్రధానంగా నాయకత్వం, ప్రజలతో సంబంధాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సామర్థ్యం , సమాజంపై ప్రభావం వంటి పలు అంశాలపై కలెక్టర్లను మూల్యాంకనం చేసింది. ఈ అంచనాలో ప్రజాభిప్రాయంతో పాటు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాసరి హరి చందన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉండగా సి. నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా విధు నిర్వహిస్తున్నారు. మిక్కిలేనేని మను చౌదరి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
ప్రజాకేంద్రిత పాలన, పరివర్తనాత్మక పరిపాలన పట్ల వారి అసాధారణ నిబద్ధతకు గుర్తింపు పొందారు. ఈ గుర్తింపు తెలంగాణకు గర్వకారణం. ఇది రాష్ట్రం బలమైన పరిపాలనా నాయకత్వాన్ని , అంకితభావంతో కూడిన ప్రజా సేవ ద్వారా దేశ నిర్మాణానికి దాని సహకారాన్ని చాటి చెబుతోంది.