Ajit Doval Rishi Sunak : రిషి సునక్ అజిత్ దోవల్ కీలక భేటీ
లండన్ టూర్ లో భద్రతా సలహాదారు
Ajit Doval Rishi Sunak : భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విదేశీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన యుఎస్ లో గత కొన్ని రోజులుగా సమావేశమయ్యారు. అంతర్జాతీయ పరంగా ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, ప్రధానంగా భద్రత, ఉగ్రవాదంపై చర్చించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో భేటీ అయ్యారు.
భారత్ , అమెరికా దేశాల మధ్య కీలక అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా ఇవాళ అజిత్ దోవల్ లండన్ కు చేరుకున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ తో(Ajit Doval Rishi Sunak) భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా భారత దేశం అన్ని దేశాలతో సత్ సంబంధాలను కొనసాగిస్తోంది.
ఓ వైపు రష్యాతోనూ ఇంకో వైపు అమెరికా, యూరోపియన్ దేశాలతో బంధం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. వాసింగ్టన్ లో యుఎస్ కు చెందిన సెక్యూరిటీ ఆఫీసర్ జేక్ సుల్లివన్ ను కలిశారు. అనంతరం లండన్ లో భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ , బ్రిటన్ కౌంటర్ టిమ్ బారో మధ్య సమావేశం జరిగింది.
ఈ కీలక భేటీలో ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా పాల్గొన్నారని లండన్ లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ, తదితర రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఇరు దేశాలు కృషి చేయాలని ఒప్పందం చేసుకున్నాయి.
Also Read : హిల్లరీ క్లింటన్ గుజరాత్ టూర్