PM Modi Address : మెగా స్పార్ట్స్ మీట్ పై ప్రధాని మోదీ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం
PM Modi Address : దేశంలోనే అతి పెద్ద మెగా స్పోర్ట్స్ ఈవెంట్ కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన మెగా స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న 6,400 మందిని ఉద్దేశించి ఇవాళ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi Address) ప్రసంగించనున్నారు. జైపూర్ రూరల్ కు చెందిన లోక్ సభ ఎంపీ , కేంద్ర మాజీ మంత్రి రాజ్య వర్దన్ సింగ్ రాథోడ్ రాజస్థాన్ రాజధానిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా తెలిపింది ఈ విషయాన్ని. ఇదిలా ఉండగా ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొన్న వేలాది మంది క్రీడాకారులను ఉద్దేశించి ప్రధానమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారు. నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేస్తారని పీఎంఓ వెల్లడించింది. కాగా ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ కు జైపూర్ మహా ఖేల్ అని పేరు పెట్టారు. వేలాది మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు.
అన్ని విభాగాలకు చెందిన ఆటలు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది కబడ్డీ పోటీలపై ఫోకస్ పెట్టింది కేంద్రం. మహా ఖేల్ పేరుతో జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా ప్రారంభమైంది.
450కి పైగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు , వార్డుల నుండి 6,400 మందికి పైగా యువకులు, క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని మొత్తం ఎనిమిది శాసనసభ ప్రాంతాల నుంచి వచ్చారు. యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, క్రీడా స్పూర్తిని కలిగించేందుకు ఇలాంటి ఈవెంట్స్ ఉపయోగ పడతాయని ఎంపీ రాథోడ్ చెప్పారు.
Also Read : బుమ్రాను చూసి భయపడ్డా – బట్లర్