Sanjay Raut : అజిత్ ప‌వార్ బీజేపీకి బానిస కాలేడు

శివ‌సేన రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్

Sanjay Raut : శివ‌సేన రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అజిత్ పవార్ భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎన్న‌టికీ బానిస కాలేడ‌న్నారు. రానున్న రోజుల్లో అజిత్ ప‌వార్ , నానా ప‌టోలేల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని సంజ‌య్ రౌత్ స్ప‌ష్టం చేశారు.

మ‌హారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా ప‌టోలేపై అజిత్ ప‌వార్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఒక ర‌కంగా ఆయ‌న తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తో అజిత్ ప‌వార్ భ‌విష్య‌త్తు ఉజ్వ‌లంగా ఉంద‌న్నార‌ను. ఆయ‌న బీజేపీలో చేర‌క పోవ‌చ్చ‌ని సంజ‌య్ రౌత్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఎంపీ మీడియాతో మాట్లాడారు. అజిత్ ప‌వార్ కు కొన్ని విలువ‌లు ఉన్నాయ‌ని తాను న‌మ్ముతాన‌ని అన్నారు. కానీ ఆయ‌న బీజేపీ వైపు చూస్తున్నార‌ని వ‌స్తున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు. ఇదంతా ప్ర‌చారం త‌ప్ప వాస్త‌వం కాద‌న్నారు సంజయ్ రౌత్(Sanjay Raut) .

నాయ‌కులు అన్నాక‌, పార్టీలు క‌లిసి ఉన్న‌ప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు రావ‌డం మామూలేన‌ని పేర్కొన్నారు ఎంపీ. త్వ‌ర‌లోనే ప‌వార్ , ప‌టోలేలు క‌లుసుకుంటార‌ని, చ‌ర్చిస్తార‌ని తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ తో త‌మ పార్టీ క‌లిసే ఉంద‌ని, మాది ఫెవికోల్ కంటే ధృఢ‌మైన బంధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు సంజ‌య్ రౌత్.

Also Read : రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు

Leave A Reply

Your Email Id will not be published!