Anurag Thakur : అవినీతి..అక్ర‌మాల‌లో ఆప్ టాప్ – ఠాకూర్

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి

Anurag Thakur : అవినీతి, అక్ర‌మాల‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వం టాప్ లో ఉంద‌న్నారు కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అత్యంత అవినీతి ప‌రుడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అవినీతిలో ఆప్ స‌ర్కార్ స‌రికొత్త రికార్డులు సృష్టించిందంటూ పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించారు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ నవీన్ కుమార్ స‌క్సేనా. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది ఆప్ స‌ర్కార్. కేంద్రం కావాల‌నే క‌క్ష సాధింపు ధోర‌ణికి పాల్ప‌డుతోంద‌ని మండిప‌డింది.

ఈ సంద‌ర్భంగా ఆప్ ఎల్జీని త‌ప్పు ప‌ట్ట‌డాన్ని తీవ్రంగా తిప్పి కొట్టారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). అవినీతిప‌రులు, అక్ర‌మార్కుల‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అండ‌గా నిలుస్తున్నారంటూ ఆరోపించారు.

పైకి నీతి సూత్రాలు వ‌ల్లె వేస్తూ లోప‌ల అవినీతికి అంద‌లం ఎక్కించార‌ని పేర్కొన్నారు. అవినీతికి పాల్ప‌డిన మంత్రులు వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఠాకూర్ డిమాండ్ చేశారు.

అవినీతి, అక్ర‌మార్కుల‌కు కొమ్ము కాస్తున్న ఢిల్లీ సీఎంకు కేంద్రాన్ని విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు. ఇప్ప‌టికే ఆరోగ్య మంత్రి స‌త్యేంద్ర జైన్ జైలులో ఉన్నారు.

ఇంకొక‌రు రెడీగా ఉన్నారు. ఈ విష‌యంలో మీరెందుకు మౌనంగా ఉన్నారంటూ ఢిల్లీ సీఎంను ప్ర‌శ్నించారు అనురాగ్ ఠాకూర్. అవినీతిలో కొత్త రికార్డులు సృష్టించారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

విచార‌ణ సంద‌ర్భంగా మంత్రి స‌త్యేంద్ర జైన్ జ్ఞాప‌క‌శ‌క్తి కోల్పోయిన‌ట్లు చెప్పాడ‌ని మ‌రి మ‌నీష్ సిసోడియా కు కూడా జ్ఞాప‌క‌శ‌క్తి ని కోల్పోతారా అని ప్ర‌శ్నించారు.

Also Read : నా కూతురు బార్ న‌డ‌ప‌డం లేదు – స్మృతీ

Leave A Reply

Your Email Id will not be published!