Kota Srinivasa Rao : నేను ఇంకా చ‌ని పోలేదు – కోట‌

ప్ర‌క‌టించిన శ్రీ‌నివాస‌రావు

Kota Srinivasa Rao : సామాజిక మాధ్య‌మాల‌లో తాను చ‌ని పోయిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ప్ర‌ముఖ న‌టుడు కోటా శ్రీ‌నివాస‌రావు(Kota Srinivasa Rao) ఖండించారు. తాను ఇంకా బ‌తికే ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే బ‌తికి ఉన్నా చ‌ని పోయిన‌ట్లు ప్ర‌చారం చేయ‌డం త‌న‌ను బాధ క‌లిగిస్తోంద‌న్నారు. ఇక‌నైనా ఇలాంటి వాటికి చెక్ పెట్టాల‌న్నారు. తాను ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాన‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కోటా శ్రీ‌నివాస‌రావు.

ఇలా కావాల‌ని ఎందుకు ప్ర‌చారం చేస్తున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని వాపోయారు న‌టుడు. శుభ‌కృత నామ సంవ‌త్స‌రం ఉగాదిని జ‌రుపు కోబోతున్నామ‌ని ఈ స‌మ‌యంలో తాను పండుగ‌ను ఘ‌నంగా జ‌రిపే ప‌నిలో బిజీగా ఉన్నాన‌ని ఈ త‌రుణంలో ఇలాంటి చావు వార్త విన‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు.

ఇలాంటి వార్త వ‌ల్ల తాను ఇబ్బంది ప‌డ‌టం మాటేమిటో కానీ విప‌రీతంగా ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని , ఇది త‌న‌ను ఆందోళ‌న క‌లిగించింద‌ని ఆవేద‌న చెందారు కోటా శ్రీ‌నివాస‌రావు. అదే కొంచెం పెద్ధ వాళ్ల‌యినా లేక గుండె వీక్ గా ఉంటే మాత్రం ఎప్పుడో చ‌ని పోయే ఉండే వార‌ని జోష్యం చెప్పారు. తాను చ‌ని పోయిన‌ట్లు వ‌చ్చిన దుష్ప్రచారంతో ఏకంగా భ‌ద్ర‌త కోసం 10 మందికి పైగా పోలీసులు ఇక్క‌డ వాలి పోయార‌ని క‌న్నీటి పర్యంతం అయ్యారు.

ఇలాంటి ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభం ఏమిటి అని ప్ర‌శ్నించారు కోటా శ్రీ‌నివాస‌రావు(Kota Srinivasa Rao). ఇలా పుకార్ల‌ను వ్యాప్తి చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Also Read : రంగ‌మార్తాండ ట్రైల‌ర్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!