KA Paul : ప‌వ‌ర్ స్టార్ కు పాల్ పిలుపు

త‌మ‌తో పొత్తుకు రావాలి

KA Paul : విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా – ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ‌తో పొత్తు కుదుర్చుకునేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితులు లేవ‌న్నారు. త్వ‌ర‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీతో జ‌న‌సేన పార్టీ ముందుకు వెళుతోంది. ఇదే విష‌యాన్ని ఇరు పార్టీల నేత‌లు బాబు, పవ‌న్ స్ప‌ష్టం చేశారు.

KA Paul Asking to Meet Pawan Kalyan

తాజాగా డాక్ట‌ర్ కేఏ పాల్(KA Paul) కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. చాలా మందికి ఇప్ప‌టికీ క్రిస్మ‌స్ అంటే ఏమిటో అర్థం కూడా తెలియ‌ద‌ని సెటైర్ వేశారు. ఆశీల‌మెట్ట‌లోని ప్ర‌జా శాంతి పార్టీ కార్యాల‌యంలో వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

ఏసు క్రీస్తు మ‌న పాపం కోసం చ‌ని పోవ‌డ‌మే మేరీ క్రిస్మ‌స్ అని స్ప‌ష్టం చేశారు డాక్ట‌ర్ కేఏ పాల్. ఏసు క్రీస్తు త‌ర్వాత ఇటువంటి ర‌క్ష‌కుడు పుట్ట లేద‌న్నారు . ప్ర‌పంచ వ్యాప్తంగా 200 దేశాల్లో క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్‌.

2 వేల సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ వ‌స్తాన‌ని ఏసు ప్ర‌భువు చెప్పార‌ని గుర్తు చేశారు. లోకంలో స్వార్థం, పాపం పేరుకు పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో 14 ఏళ్ల పాటు అవినీతికి పాల్ప‌డ్డార‌ని , ప్ర‌త్యేక ప్యాకేజీ, హోదా సాధించ లేక పోయారంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Jyothula Chanti Babu : టీడీపీ వైపు జ్యోతుల చూపు

Leave A Reply

Your Email Id will not be published!