Kumar Sangakkara : రన్స్ కోసం కాదు జట్టు కోసం ఆడతాడు
ఆర్ఆర్ హెడ్ కోచ్ కుమార సంగక్కర
Kumar Sangakkara : రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర(Kumar Sangakkara) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ లో పాయింట్ల పట్టికలో 10 పాయింట్లు సాధించి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. తాజాగా రాజస్థాన్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో వరుసగా ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించింది రాజస్థాన్ రాయల్స్.
జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. యంగ్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ 77 రన్స్ తో రెచ్చి పోతే బట్లర్ , శాంసన్ , ధ్రువల్ , పడిక్కల్ రాణించారు.
అనంతరం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులకే పరిమితమైంది ఆరు వికెట్లు కోల్పోయి. ఆడం జంపా , రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. జంపా 4 ఓవర్లు వేసి 23 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 32 రన్స్ తేడాతో చెన్నైపై విజయం సాధించింది.
మ్యాచ్ గెలుపొందిన అనంతరం హెడ్ కోచ్ కుమార సంగక్కర(Kumar Sangakkara) జట్టును ఉద్దేశించి మాట్లాడాడు. సంజూ శాంసన్ తన వ్యక్తిగత రికార్డులు, పరుగుల కోసం ఆడడని జట్టు కోసం ఆడతాడని కితాబు ఇచ్చాడు. ప్రస్తుతం కుమార సంగక్కర చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : ఢిల్లీ క్రికెటర్ అసభ్య ప్రవర్తన