NTR Salman Sonu Sood : రైలు ప్ర‌మాదం సెల‌బ్రిటీల‌ సంతాపం

ఎన్టీఆర్, సోనూ సూద్ , అగ్నిహోత్రి , స‌ల్మాన్ , అక్ష‌య్ కుమార్

NTR Salman Sonu Sood : ఒడిశా రాష్ట్రం బాలా సోర్ జిల్లాలో చోటు చేసుకున్న కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని, ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. శుక్ర‌వారం స‌రిగ్గా 7.15 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న క‌న్నీళ్ల‌ను పెట్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 300 మంది చ‌ని పోయిన‌ట్లు అంచ‌నా. 1,000 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బాలా సోర్ చుట్టు ప‌క్క‌ల ఉన్న ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు బాధితుల్ని.

ఈ సంద‌ర్భంగా బాలీవుడ‌, కోలివుడ్, శాండిల్ వుడ్ , టాలీవుడ్ సినీ రంగాల‌కు చెందిన న‌టీ, న‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, టెక్నీషియ‌న్లు రైలు దుర్ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు. త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), జూనియ‌ర్ ఎన్టీఆర్(NTR), ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంచు మ‌నోజ్ , స‌ల్మాన్ ఖాన్ , సోనూ సూద్ , వివేక్ అగ్ని హోత్రి, స‌ల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్ , కిర‌న్ ఖేర్ , త‌దిత‌రులు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు త‌మ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా మూడు రైళ్లు ఒక‌దానితో మ‌రొక‌టి ఢీకొన్నాయి. కిర‌ణ్ ఖేర్ అయితే ఏకంగా క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. నా ఆలోచ‌న‌లు, ప్రార్థ‌న‌లు మృతుల కుటుంబాల‌తో ఉన్నాయి. క్ష‌తగాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో వారికి దేవుడు మ‌రింత ఆస‌రా ఇవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. సోనూ సూద్ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని జ‌త చేశారు సోనూ సూద్.

మూడు రైళ్లు ఒక‌దానితో మ‌రొక‌టి ఢీ కొనేందుకు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహొత్రి ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా 200 అంబులెన్స్ లు, 50 బ‌స్సులు , 45 మొబైల్ హెల్త్ యూనిట్లు ప్ర‌మాద స్థ‌లంలో ప‌ని చేస్తున్నాయి.

Also Read : Chiranjeevi Express

Leave A Reply

Your Email Id will not be published!