Pawan Kalyan : ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్

కాకినాడ జిల్లాపై జ‌న‌సేనాని స‌మీక్ష

Pawan Kalyan : కాకినాడ – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త్వ‌ర‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఎలాగైనా స‌రే అధికారంలోకి రావాల‌ని దృష్టి సారించారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇందులో భాగంగా గురువారం కాకినాడ కేంద్రంగా జ‌న‌సేన జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ లు , ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు.

Pawan Kalyan Comment

పార్టీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి సారించారు ప్ర‌త్యేకంగా. ఆయా ప్రాంతాల‌కు సంబంధించి కోఆర్డినేట‌ర్ల‌తో విడివిడిగా స‌మావేశం అయ్యారు. ఒక్కరొక్క‌రితో ప్ర‌త్యేకంగా భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మాజీ మంత్రి ఆది కేశ‌వులు నాయుడు మ‌నుమ‌రాలు చైత‌న్య జ‌న‌సేన పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే స‌మ‌యంలో కాకినాడ‌కు చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని తెలుగుదేశం పార్టీతో క‌లిసి జ‌న‌సేన ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌నుంది. ఇక మూడు రోజుల పాటు కాకినాడ‌లోనే ఉండ‌నున్నారు.

Also Read : Bharat Rice NAFED : పేద‌ల‌కు స‌ర్కార్ బియ్యం

Leave A Reply

Your Email Id will not be published!