President Draupadi Murmu : ఆతిథ్యానికి ప్రెసిడెంట్ ఫిదా
ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం
President Draupadi Murmu : హైదరాబాద్ – భారత దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కు ఘనంగా వీడ్కోలు పలికారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
President Draupadi Murmu Thanks
శీతాకాలం సందర్భంగా ప్రతి ఏటా దేశ రాష్ట్రపతి పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రెసిడెంట్ హైదరాబాద్ కు విచ్చేశారు. ఇతర ప్రాంతాలను పర్యటించారు. రాష్ట్రపతి టూర్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
ఇదిలా ఉండగా కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లను చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(President Draupadi Murmu). తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వంటకాలను ఏర్పాటు చేయడం పట్ల సంతోషానికి గురయ్యారు రాష్ట్రపతి.
తనకు సేవలందించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సమయంలో గవర్నర్ ఆప్యాయంగా తనతో ఉండడాన్ని కూడా ప్రస్తావించారు ద్రౌపది ముర్ము. ఇదిలా ఉండగా సీతక్క తాను ఆదివాసీ ప్రాంతానికి చెందిన వ్యక్తినంటూ ప్రెసిడెంట్ కు విన్నవించారు. ఇదే సమయంలో కేంద్ర సర్కార్ ఈ ప్రాంతానికి గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
Also Read : CM Revanth Reddy : కలెక్టర్లు..ఎస్పీలకు సీఎం దిశా నిర్దేశం