Bharat Nyay Yatra : మరో యాత్రకు రాహుల్ శ్రీకారం
జనవరి 14 నుంచి మార్చి 20 వరకు
Bharat Nyay Yatra : న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా సరే ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీని అధికారానికి దూరం చేయాలని ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు సమావేశం కావడం జరిగింది.
Bharat Nyay Yatra Started Rahul Gandhi
తాజాగా దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిజోరంలో ప్రతిపక్ష పార్టీ పవర్ లోకి రాగా రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో ప్రభుత్వాలను కోల్పోయింది. అనూహ్యంగా తెలంగాణలో పవర్ లోకి వచ్చింది.
దీంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు గాను ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టారు. తమిళనాడు నుంచి కాశ్మీర్ దాకా కాలి నడకన తిరిగారు. వేలాది మంది ఆయనతో పాటే ప్రయాణం చేశారు.
తాజాగా మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి కాంగ్రెస్ భారత్ న్యాయ యాత్ర అని పేరు పెట్టారు. జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్రను చేపట్టినట్టు పార్టీ పేర్కొంది. మణిపూర్ నుంచి ముంబై వరకు కొనసాగనుందని వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20 వరకు భారత్ న్యాయ యాత్ర కొనసాగుతుందని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఈ యాత్రంలో 14 రాష్ట్రాలు 85 జిల్లాల మీదుగా 6,200 కిలోమీటర్ల యాత్ర సాగనుందని పేర్కొంది.
Also Read : Shakeel Son : షకీల్ కొడుకుకు లుక్ అవుట్ నోటీస్