Rahul Gandhi : అన్నిటా హ‌స్తం గెలుపు ఖాయం

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Rahul Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం దేశంలోని 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ మ‌ధ్య‌ప్ర‌దేశ్ , చ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇక న‌వంబ‌ర్ 30న తెలంగాణ‌లో పోలింగ్ కొన‌సాగుతుంది.

Rahul Gandhi Comment

ఇదిలా ఉండ‌గా ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్, ఛ‌త్తీస్ గ‌ఢ్ , తెలంగాణ రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదం త‌మ పార్టీ ప‌ట్ల ఉంద‌న్నారు రాహుల్ గాంధీ.

హ‌స్తం తుపాను రావ‌డం ప‌క్కా అని, దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోంద‌న్నారు. ఇక‌నైనా తెలంగాణ ప్ర‌జ‌లు మేల్కోవాల‌ని పిలుపునిచ్చారు. కేవ‌లం నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. కేవ‌లం ఒకే ఒక్క కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డింద‌న్నారు రాహుల్ గాంధీ .

పేద‌లు, రైతులు, మ‌హిళ‌లు, యువ‌కులు మేలు కోవాల‌ని, విలువైన ఓటును స‌రైన అభ్య‌ర్థుల‌కు వేయాల‌ని సూచించారు రాహుల్ గాంధీ.

Also Read : Kodandaram : బీఆర్ఎస్ స‌ర్కార్ బేకార్

Leave A Reply

Your Email Id will not be published!