Rahul Gandhi Met : రాహుల్ మెచ్చుకున్న రామేశ్వ‌ర్

కూర‌గాయ‌ల విక్రేత నెట్టింట్లో వైర‌ల్

Rahul Gandhi Met : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌నలో చాలా మార్పు వ‌చ్చింది. భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన స‌మ‌యంలో వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వేలాది మంది ఆయ‌న‌తో త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకున్నారు. తాజాగా రాహుల్ గాంధీ హాట్ టాపిక్ గా మారారు.

Rahul Gandhi Met Common Man

కూర‌గాయ‌ల విక్రేత రామేశ్వ‌ర్ తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో క‌లిసి త‌న ఇంట్లో భోజ‌నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

రాజ‌ధాని ఢిల్లీ లోని ఆజాద్ పూర్ మండిలో రామేశ్వ‌ర్ కూర‌గాయ‌లు అమ్మ‌డం చేస్తారు. త‌న‌తో రాహుల్ గాంధీ మాట్లాడ‌టం, ధ‌ర‌లు అడ‌గ‌డం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని క‌స్ గంజ్ లోని ఖ‌తైలీ గ్రామంలో ఉంటున్నారు రామేశ్వ‌ర్ జీ. ఢిల్లీలో ఉంటూ కూర‌గాయాలు అమ్మే వారు.

రాహుల్ గాంధీని క‌ల‌వాల‌న్న త‌న కోరిక‌ను తీర్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). విష‌యం తెలుసుకున్న రాహుల్ ఆగ‌స్టు 1న ఆజాద్ పూర్ మండికి చేరుకున్నారు. అక్క‌డ కూర‌గాయ‌లు, పండ్ల వ్యాపారుల‌తో సంభాషించారు. ఇదే స‌మ‌యంలో రామేశ్వ‌ర్ జీ క‌ల‌వ‌లేక పోయారు. ఇది గ‌మ‌నించిన రాముల్ రామేశ్వ‌ర్ తో క‌ల‌వ‌డం విశేషం.

Also Read : YS Sharmila : ఇండియ‌న్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ష‌ర్మిల‌

Leave A Reply

Your Email Id will not be published!