Revanth Reddy : నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు – రేవంత్
తానా సభలో నేను అలా అనలేదు
Revanth Reddy : రైతులకు సంబంధించి తాను కరెంట్ విషయంలో చేసిన కామెంట్స్ ను కావాలని వక్రీకరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని, అన్నదాతలు ఎన్ని కష్టాలు పడుతున్నారో వారి ఇబ్బందులు ఏమిటో దగ్గరుండి చూశానని అన్నారు. గురువారం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి చర్చకైనా సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఉచిత విద్యుత్ పేరుతో రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ , దాని చీఫ్ , సీఎం కేసీఆర్ వందల కోట్లు అప్పులు తీసుకు వచ్చారని దీని వల్ల అదనపు భారం పడుతుందన్నారు. దీనిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తనకు తెలియడం లేదన్నారు. ఉచిత విద్యుత్ రైతులకు తాము కూడా ఇస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తాను 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఎంతో ధరకు కొనుగోలు చేసిన విద్యుత్ స్టార్టర్లు, మోటార్లు కాలి పోతున్నాయని తాను ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందే తప్పా రైతుల గురించి ఒక్క మాట కూడా అనలేదన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా సరే తాను చర్చించేందుకు సిద్దమని సవాల్ విసిరారు.
Also Read : krish 2.0 Drone : మందుల పిచికారీకి డ్రోన్ల తయారీ