RS Praveen Kumar : హ్యాట్సాఫ్ భాను ప్రసాద్ – ఆర్ఎస్పీ
పేదరికంలో పుట్టినా నాయకుడిగా ఎంపిక
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. పేదరికంలో పుట్టిన భాను ప్రసాద్ ఓడ రేవులో నావికుడిగా ఎంపికయ్యాడని తెలిపారు. ఈ సందర్భంగా సక్సెస్ అయిన పేద అబ్బాయి ఫోటోలను పంచుకున్నారు. ఇలాంటి వాళ్లు ఎందరో చదువుకుని తమ కాళ్ల మీద నిలబడ్డారని ప్రశంసించారు. తాను గురుకులాలకు సెక్రటరీ గా ఉన్న సమయంలో భాను ప్రసాద్ చదువుకున్నాడని పట్టుదలతో అనుకున్నది సాధించాడని భాను ప్రసాద్ ను కొనియాడారు ఆర్ఎస్పీ.
RS Praveen Kumar Appreciates
పేదరికంలో పుట్టిన భాను ప్రసాద్ లాంటి బిడ్డలు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారని, వారిని చేరదీసి ప్రోత్సహిస్తే మట్టిలోంచి మాణిక్యాలు తయారవుతారని స్పష్టం చేశారు బీఎస్పీ చీఫ్(RS Praveen Kumar). భారత రాష్ట్ర సమితి పార్టీని, ప్రస్తుత ప్రభుత్వాన్ని, పాలకులను ఏకి పారేశారు. వీళ్లంతా కలిసి మన బహుజన బిడ్డలను సముద్రంలో ముంచుతున్నారని ఆరోపించారు. కానీ బీఎస్పీ మాత్రం అలాంటి వాళ్లను మహా సముద్రంలో నావికులుగా తయారు చేస్తామని చెబుతోందని ప్రకటించారు.
భాను ప్రసాద్ ను ఆదర్శ ప్రాయంగా తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. చదువు ఒక్కటే గమ్యం కావాలని అదే మనల్ని మారుస్తుందన్నారు బీఎస్పీ చీఫ్.
Also Read : TTD Chairman : ఆలయాలను దర్శించుకున్న భూమన