Sanjay Raut : ఫ‌డ్న‌వీస్ పై సంజ‌య్ రౌత్ ఫైర్

క‌మిష‌న‌ర్ నుండి కానిస్టేబుల్ స్థాయికి

Sanjay Raut : శివ‌సేన యూబీటీ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut) నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్ పై మండిప‌డ్డారు. ఆయ‌న క‌మిష‌న‌ర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి దిగ‌జ‌రారంటూ ఆరోపించారు సంజ‌య్ రైత్. ఉద్ద‌వ్ ఠాక్రే నాయ‌క‌త్వంలోని ప్ర‌తి నాయ‌కుడు సంతృప్తితో ఉన్నార‌ని పేర్కొన్నారు. కానీ అధికారంలోకి అప‌విత్రంగా వ‌చ్చిన షిండే, ఫ‌డ్న‌వీస్ మాత్రం ఏదో ఒక‌రోజు దారుణంగా ఓడి పోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

ఈ ప్ర‌భుత్వం వ‌ల్ల ఎవ‌రికి లాభం జ‌రిగిందో చెప్పాల‌న్నారు. విలువైన ఫ్యాక్ట‌రీలు ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లి పోతుంటే ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం త‌మ ప‌ద‌వుల‌ను కాపాడుకునేందుకే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇక ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వినేందుకు , ప‌రిష్క‌రించేందుకు వీరికి టైం ఎలా స‌రిపోతుంద‌ని ఎద్దేవా చేశారు సంజ‌య్ రౌత్. డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్ పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు.

ఇక ఇత‌రుల‌ను ఎలా సంతోష పెట్ట‌గ‌ల‌రంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మా పార్టీలోంచి వెళ్లిన వారు తిరిగి మా వ‌ద్ద‌కు రావాల‌ని అనుకుంటున్నార‌ని జోష్యం చెప్పారు. 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు త్వ‌ర‌లో రానున్నార‌ని పేర్కొన్నారు. తాజాగా శివ‌సేన మౌత్ పీస్ సామ్నా ప‌త్రిక సంపాద‌కీయంలో దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు సంజ‌య్ రౌత్.

Also Read : MS Dhoni Comment

Leave A Reply

Your Email Id will not be published!