Zia Ur Rehman Shot Dead : హిజ్బుల్ ముజాహిదీన్ లీడ‌ర్ హ‌తం

క‌రాచీలో జియా ఉర్ రెహ్మాన్ కాల్చి వేత‌

Zia Ur Rehman Shot Dead : క‌రాచీ – పాకిస్తాన్ లోని క‌రాచీలో గురువారం హిజ్ బుల్ ముజాహిద్దీన్ సంస్థ‌కు చెందిన టాప్ లీడ‌ర్ , టెర్ర‌రిస్ట్ జియా ఉర్ రెహ్మాన్ కాల్చి చంప‌బ‌డ్డాడు. స‌ద‌రు టెర్ర‌రిస్ట్ ను గుర్తు తెలియ‌ని ముష్క‌రులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.

Zia Ur Rehman Shot Dead Viral

ఒక్క‌సారిగా హిజ్ బుల్ ముజాహిద్దీన్ ను లేపేయ‌డంతో ఒక్క‌సారిగా పాకిస్తాన్(Pakistan) లో క‌ల‌క‌లం రేపింది. క‌రాచీలో తీవ్ర భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఐఎస్ఐ, ఇత‌ర పాకిస్తాన్ టెర్రిర‌స్ట్ సంస్థ‌లు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో పాకిస్తాన్ భ‌య‌ప‌డుతోంది. 2 వారాల త‌ర్వాత కూడా పాకిస్తాన్ పోలీసులు ఎవ‌రు చంపార‌నే దానిపై ఇంకా క‌నుగొన‌లేదు.

విచిత్రం ఏమిటంటే భార‌త దేశ ప్ర‌భుత్వ‌మే హిజ్ బుల్ ముజాహిద్దీన్ తో పాటు ఇత‌ర టెర్ర‌రిస్టు సంస్థ‌ల‌కు చెందిన టాప్ లీడ‌ర్ల‌ను చంపుతోందంటూ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. మ‌రో వైపు భార‌త భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ఉన్నంత వ‌ర‌కు తాము ఇండియాను ఒక్క అడుగు కూడా తాక‌లేమ‌ని పాకిస్తాన్ జాతీయ భ‌ద్ర‌తా అధికారి భావిస్తున్నారు.

ఆయ‌న ఎప్పుడు ఎక్క‌డ ఉంటాడో, ఎలా మాటు వేసి మ‌ట్టు పెడ‌తాడో ఎవ‌రికీ తెలియ‌దు.

Also Read : Mallikarjun Kharge : ఇండియా కూట‌మి గెలుపు ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!