INDW vs AUSW T20 Semis : భార‌త్ గెలిచేనా ఆసిస్ నిలిచేనా

సెమీ ఫైన‌ల్ లో నువ్వా నేనా

INDW vs AUSW W Cup T20 Semis : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ మ‌హిళ‌ల టి20 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. టోర్నీ ముగిసేందుకు అడుగు దూరంలో ఉంది. మెగా టోర్నీలో చివ‌ర‌కు నాలుగు జ‌ట్లు సెమీస్ కు(INDW vs AUSW W Cup T20 Semis) చేరుకున్నాయి. అంతా ఊహించిన‌ట్లుగానే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ , ఇండియా, ద‌క్షిణాఫ్రికా బ‌రిలో నిలిచాయి. టోర్నీలో మొత్తం 10 జ‌ట్లు పాల్గొన్నాయి. గ్రూప్ -బిలో 5 జ‌ట్లు గ్రూప్ – ఎలో 5 జ‌ట్ల చొప్పున ఆడాయి. చివ‌ర‌కు నాలుగు సెమీస్ చేరుకోవ‌డంతో ఫైన‌ల్ కోసం రేప‌టితో తేలి పోతుంది.

ఇక మొద‌టి సెమీ ఫైన‌ల్ ఫిబ్ర‌వ‌రి 23 గురువారం హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అన్ని రంగాల‌లో బ‌లంగా ఉన్న డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఇవాల్టితో తాడో పేడో తేలిపోనుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ చేజిక్కించు కోవాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడింది.

మూడు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది ఇంగ్లండ్ తో జ‌రిగిన హోరా హోరీ మ్యాచ్ లో ఓట‌మి పాలైంది. ఇక రెండో సెమీస్ ఫిబ్ర‌వ‌రి 24న ఇంగ్లండ్ , ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. గ‌త ఏడాది ఫైన‌ల్ లో భార‌త్ ను ఓడించిన ఆసిస్ తిరిగి సెమీస్ తో త‌ల‌ప‌డనుంది.

జట్టు ప‌రంగా చూస్తే హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా , స్మృతీ మంధాన‌, జెమీమా రోడ్రిగ్స్ , షెఫాలీ వ‌ర్మ‌, దీప్తి శ‌ర్మ‌, రిచా ఘోష్ , దేవికా వైద్య‌, పూజా వ‌స్త్రాక‌ర్ , శిఖా పాండే , రేణుకా సింగ్ , రాజేశ్వ‌రి గైక్వాడ్ ఆడ‌నున్నారు.

Also Read : టాటా చేతికి మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్

Leave A Reply

Your Email Id will not be published!