IPL MS Dhoni Viral : ధోనీ పాదాలకు నమస్కరించిన స్టార్ సింగర్ వీడియో వైరల్
IPL MS Dhoni Viral : కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే సాగిన ఐపీఎల్ ఈసారి మాత్రం తారల తలుకులతో ఘనంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది.
కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే సాగిన ఐపీఎల్ ఈసారి మాత్రం తారల తలుకులతో ఘనంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు అభిమానులను కట్టిపడేశాయి.
ముందుగా బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ మ్యూజిక్ షోతో (Arjit Singh) రంభమైన ఆరంభ వేడుకలు సినీ తారలు రష్మిక మందన, తమన్నా డ్యాన్స్లతో హోరెత్తిపోయాయి. పుష్ప సినిమాలోని సామీ సామీ పాటకు రష్మిక స్టెప్పులేస్తే, ఇదే సినిమాలోని ‘ఊ అంటావా మామా’ సాంగ్కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది తమన్నా.
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధూమల్తో పాటు చెన్నై, గుజరాత్ కెప్టెన్లు ధోనీ, హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే సందర్భంగా ఐపీఎల్ వేదికపై ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ మహేంద్ర సింగ్ ధోనీ (IPL MS Dhoni Viral) పాదాలు మొక్కాడు. అర్జిత్ హఠాత్తుగా ఇలా చేయడంతో ధోని కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే సింగర్ను పైకి తీసుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ సమయంలో రష్మిక, తమన్నా కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
స్టార్ సింగరై ఉండి ధోని కాళ్లు మొక్కడం పట్ల అర్జిత్ తన సింప్లిసిటీని చాటుకున్నాడని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫొటో ఆఫ్ ద డే, బెస్ట్ పిక్చర్ ఆన్ ఇంటర్నెట్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : మార్క్వుడ్ ‘సెన్సేషన్ .. లక్నో చేతిలో ఢిల్లీ చిత్తు !