MS Dhoni : ధోనీ ధ‌నా ధ‌న్ రాజ‌స్థాన్ ప‌రేషాన్

చుక్క‌లు చూపించిన ర‌వీంద్ర జ‌డేజా

MS Dhoni IPL 2023 :  ప్ర‌పంచ క్రికెట్ లో ఇప్పుడు పొట్టి ఫార్మాట్ రాజ్యం ఏలుతోంది. టి20లో నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. ఫ్యాన్స్ కూడా త్వ‌ర‌లోనే రిజ‌ల్ట్ తేలే ఈ ఫార్మాట్ నే ఇష్ట ప‌డుతున్నారు. తాజాగా చెన్నై చెపాక్ స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ కీల‌క లీగ్ మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్ట‌రీని న‌మోదు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్(CSK vs RR).

చివ‌రి బంతి దాకా ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి. కానీ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న‌దైన రీతిలో కెప్టెన్సీ నిర్వ‌హించాడు. ఆఖ‌రులో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సీమ‌ర్ సందీప్ శ‌ర్మ‌కు బౌలింగ్ చేసే అవ‌కాశం ఇచ్చాడు.

అంత‌కు ముందు 19వ ఓవ‌ర్ లో జేస‌న్ హోల్డ‌ర్ కు ఇచ్చినా ప‌రుగులు పిండుకున్నారు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) , రవీంద్ర జ‌డేజా. సిక్స‌ర్లు, ఫోర్ల వ‌ర్షం కురిపించారు. కానీ ఆఖ‌రి ఓవ‌ర్ లో 21 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది గెలిచేందుకు. మొద‌టి బంతి వైడ్ బాల్. 

దీంతో సందీప్ శ‌ర్మ ఏం చేస్తాడోన‌ని స్టేడియం అంతా ఉత్కంఠ‌కు లోనైంది. కానీ త‌న అద్భుత‌మైన బంతుల‌తో ధోనీ, జ‌డేజాల‌కు ప‌రుగులు ఇవ్వ‌లేదు. దీంతో 3 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. ఎంఎస్ ధోనీ 17 బంతులు ఎదుర్కొని 32 ర‌న్స్ చేస్తే ర‌వీంద్ర జ‌డేజా 15 బాల్స్ ఎదుర్కొని 25 ప‌రుగులు చేశాడు.

Also Read : జోస్ బ‌ట్ల‌ర్ అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!