Dasoju Sravan : సాయిచంద్ కుటుంబానికి కోటిన్నర సాయం
అందజేసిన మంత్రి, దాసోజు శ్రవణ్
Dasoju Sravan : తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అలుపెరుగని రీతిలో తన ఆట, పాటలతో ఉర్రూత లూగిస్తూ బీఆర్ఎస్ పార్టీకి గొంతుకగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సాయి చంద్ ఇటీవల గుండె పోటుతో మరణించారు.
Dasoju Sravan 1.5Cr Cheque Handovered to Sai Chand
దీంతో ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటానని ప్రకటించారు. సాయిచంద్ భార్య రజనికి ఏకంగా రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ముందుగా ప్రకటించిన విధంగానే కేసీఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రూ. 1 కోటి సాయం చేస్తానన్నారు.
ఈ మేరకు కోటి విరాళానికి సంబంధించిన చెక్కును బుధవారం రజనీ సాయిచంద్ ఇంటికి వెళ్లి అందజేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ .
పార్టీ తరపు నుండి దీనిని అందజేసినట్లు తెలిపారు డాక్టర్ దాసోజు శ్రవణ్(Dasoju Sravan). రజనీ సాయించద్ , పిల్లలకు గుర్రంగూడలోని వారి నివాసంలో కలిసి ఇచ్చినట్లు చెప్పారు.
అంతే కాకుండా భార్యకు రూ. కోటితో పాటు సాయి చంద్ తండ్రికి , చెల్లెలికి చెరో రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందజేసినట్లు వెల్లడించారు. తనను నమ్ముకున్న వారికి కేసీఆర్ న్యాయం చేస్తారని ఈ విషయంలో రుజువైందన్నారు దాసోజు శ్రవణ్.
Also Read : Nara Lokesh : పేదల పెన్నిధి రవన్న – లోకేష్