అమరావతి : యువతీ యువకులు స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సోమవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని పాటిస్తూ యువత వివేకానంద వేసిన మార్గంలో నడుస్తుందని నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ అభివృద్ధికి యువతరం సహకరించాలని కూడా నాయుడు పిలుపు ఇచ్చారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం స్వామి వివేకానంద ఆదర్శాల నుండి బలాన్ని పొందుతుందని ఆయన అన్నారు.
వివేకానంద బోధనలు ఆత్మ విశ్వాసం, ధైర్యం, సేవా స్ఫూర్తిని నిరంతరం ప్రేరేపిస్తాయని ఆయన చెప్పారు. ఆ దార్శనిక నాయకుడు యువ మనస్సులపై అపారమైన నమ్మకం ఉంచి, వారు వ్యక్తిత్వ నిర్మాణం, జ్ఞాన సముపార్జన, మానవత్వానికి సేవ చేయాలనే నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువతీ యువకులు మన దేశానికి గొప్ప బలం అని అన్నారు. క్రమశిక్షణ, ఐక్యత , సామాజిక సామరస్యాన్ని పాటిస్తూ యువత వివేకానంద వేసిన మార్గంలో నడుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ అభివృద్ధికి యువతరం సహకరించాలని కూడా నాయుడు పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే మహోన్నతమైన మానవుడిగా గుర్తింపు పొందారు స్వామి వివేకానందుడు అని అన్నారు ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు. చివరి శ్వాస వరకు దేశం కోసం పరితపించాడని పేర్కొన్నారు. భారతీయ జాతిని జాగృతం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి.
