సింగపూర్ : అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్ లో తన కచేరి నిర్వహించేందుకని వెళ్లి అనుమానాస్పద మృతికి గురయ్యాడు. ఇందుకు సంబంధించి విచారణకు ఆదేశించింది ఆ రాష్ట్ర సర్కార్. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం హిమంత బిస్వ. అంతే కాకుండా ఈ భూమి పుత్రుడికి నివాళులు అర్పిస్తూ వేలాది మంది జనం కడదాకా వచ్చారు. వీధులన్నీ నిండి పోయాయి. కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. బహుషా ఆ రాష్ట్రం లో భూపేన్ హజరికా తర్వాత అంతగా నివాళి అందుకున్న గాయకుడు జుబీన్ గార్గ్ మాత్రమే. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా ఊహించని విధంగా సింగపూర్ పోలీసులు ఇవాళ కోర్టుకు జుబీన్ గార్గ్ మృతికి సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేశారు. తను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. లాజరస్ ద్వీపం సమీపంలోని పడవ నుండి దూకి గాయకుడు మునిగి పోయాడని చెప్పారు . జుబీన్ గార్గ్ మరణానికి సంబంధించి కలతపెట్టే వివరాలు వెలువడ్డాయి. ఈత కొట్టడానికి ముందు లైఫ్ వెస్ట్ ధరించడానికి నిరాకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. మరణించే సమయానికి 52 ఏళ్ల గాయకుడు, స్కూబా డైవింగ్ సంఘటనలో మరణించాడని మొదట్లో భావించారు, కానీ అధికారులు తరువాత నీటిలో మునిగి పోవడమే కారణమని నిర్ధారించారు.
అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డేవిడ్ లిమ్ మాట్లాడారు. జుబీన్ గార్గ్ పడవ నుండి దూకడానికి ముందు మద్యం సేవించాడని, లైఫ్ జాకెట్ ధరించమని నౌక కెప్టెన్ పదేపదే సూచనలను చేసినా పట్టించు కోలేదని తెలిపాడు. స్నేహితులు అతన్ని పడవలోకి లాగారు, అక్కడ అతన్ని ఆసుపత్రికి తరలించే ముందు సీపీఆర్ కూడా చేశారని, కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు.
