Balakrishna Row : న‌ర్సుల వివాదం బాల‌య్య ప‌శ్చాతాపం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ లో కామెంట్స్

Balakrishna Row : ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఈ మ‌ధ్య‌న హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయ‌న ఏదో ఒక‌టి అనడం . అది వైర‌ల్ గా మార‌డం ఆ త‌ర్వాత రాద్దాంతం చోటు చేసుకోవ‌డం కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇటీవ‌ల తాను న‌టించిన వీర సింహా రెడ్డి స‌క్సెస్ మీట్ లో అక్కినేనిపై నోరు జారారు. అక్కినేనా తొక్కానా అంటూ ఎద్దేవా చేశారు. తీవ్ర వివాదానికి దారి తీసింది.

అక్కినేని ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. బాల‌య్య‌పై(Balakrishna Row) మండిప‌డ్డారు. దీంతో తాను అలా అన‌లేద‌ని , కావాల‌ని కొంద‌రు త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ పేర్కొన్నారు. అక్కినేని నాగార్జున‌, నాగ చైత‌న్య సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యారు. మేం మీ నాన్న‌గారు ఎన్టీఆర్ ను అలా అంటే మీరు ఊరుకుంటారా అని ప్ర‌శ్నించారు. చివ‌ర‌కు బాల‌కృష్ణ రంగంలోకి దిగారు. తాను కావాల‌ని అన‌లేద‌ని పేర్కొన్నారు. తామిద్ద‌రికీ మంచి అనుబంధం ఉంద‌న్నారు.

అక్కినేని నాగేశ్వ‌ర్ రావును తాను బాబాయి అని పిలిచే వాడిన‌ని , త‌న‌కు ఆయ‌న‌తో చ‌నువు ఉంద‌ని గుర్తు చేశారు. ఇదిలా ఉండ‌గానే ఇటీవ‌ల ఆహాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో బాల‌య్య అన్ స్టాప‌బుల్ షో చేశారు. మాట్లాడుతుండ‌గా న‌ర్సుల గురించి చుల‌క‌న‌గా మాట్లాడారు(Balakrishna Row). దీంతో న‌ర్సుల సంఘాలు పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి.

క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశాయి. దీంతో నంద‌మూరి బాల‌కృష్ష స్పందించారు. త‌న‌కు న‌ర్సులంటే గౌర‌వం ఉంద‌ని , వారు ఇతోధికంగా రోగుల‌కు సేవ‌లు అందిస్తున్నారంటూ కొనియాడారు బాల‌య్య‌.

Also Read : రికీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డు

Leave A Reply

Your Email Id will not be published!