HCA President : రాచ‌కొండ సీపీతో హెచ్‌సీఏ చీఫ్ భేటీ

భార‌త్ - ఇంగ్లండ్ మ్యాచ్ పై స‌మీక్ష

HCA President : హైద‌రాబాద్ – హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్(HCA) అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రావు రాచ‌కొండ సీపీ సుధీర్ బాబును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే నెల‌లో భార‌త్ – ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య 25వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సీపీతో చ‌ర్చించారు జ‌గ‌న్ మోహ‌న్ రావు అర్శ‌న‌ప‌ల్లి.

HCA President Met Rachakonda CP

మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు గాను స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని ఈ సంద‌ర్భంగా కోరారు సీపీని ప్రెసిడెంట్ . మ్యాచ్ స‌జావుగా సాగేందుకు తోడ్పాటు అందించాల‌ని సూచించారు.

దీంతో సీపీ సుధీర్ బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం ఉప్ప‌ల్ స్టేడియంకు వ‌చ్చి ప‌రిశీలిస్తాన‌ని సీపీ హామీ ఇచ్చారు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ జ‌గ‌న్ మోహ‌న్ రావుకు. ఇదిలా ఉండ‌గా సుధీర్ బాబును క‌లిసిన వారిలో ప్రెసిడెంట్ తో పాటు హెచ్ సీ ఏ కార్య‌ద‌ర్శి దేవ‌రాజ్ , ఉపాధ్య‌క్షుడు ద‌ల్జిత్ సింగ్, స‌హాయ కార్య‌ద‌ర్శి బ‌స‌వ‌రాజు, కోశాధికారి జేసీ శ్రీ‌నివాస్ ఉన్నారు.

Also Read : Araku Cafe Viral : ముంబైలో అర‌కు కేఫ్ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!