Nakka Anand Babu : న‌మ్మ‌క ద్రోహం జ‌గ‌న్ నైజం – న‌క్కా

మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్

Nakka Anand Babu : అమ‌రావ‌తి – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మాజీ మంత్రి న‌క్కా ఆనంద్ బాబు. మాయ మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఘ‌నుడు అంటూ మండిప‌డ్డారు. అడ్డగోలు నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌లు మోస పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో న‌క్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు.

Nakka Anand Babu Comments on Jagan

మూడు రాజ‌ధానుల‌ని న‌మ్మించాడ‌ని , ఆ త‌ర్వాత ఊసే లేకుండా పోయింద‌న్నారు. తండ్రి వైఎస్సార్ ఆత్మ‌గా పేరు పొందిన కేవీపీ, సూరీడు క‌నిపించ‌కుండా పోయార‌ని సెటైర్ వేశారు. ఆయ‌న త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌తో ఎమ్మెల్యేలు, మంత్రులు ఆగ‌మాగం అవుతున్నారంటూ మండిప‌డ్డారు న‌క్కా ఆనంద్ బాబు.

దేశానికి, రాష్ట్రానికి హ‌ద్దులు ఉంటాయ‌ని కానీ జ‌గ‌న్ న‌మ్మ‌క ద్రోహానికి మాత్రం ఎలాంటి హద్దులు ఉండ‌వ‌న్నారు. ద్రోహం, ద‌గా కేరాఫ్ జ‌గ‌న్ రెడ్డి(AP CM YS JAGAN) అంటూ ఫైర్ అయ్యారు. సీఎం చేసిన ఆకృత్యాలు, అరాచ‌కాలు మెల మెల్ల‌గా ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న స్వంత ప్ర‌యోజ‌నాల కోసం ఎంతటి వారినైనా బ‌లి చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య అన్నారు. జ‌నం స‌మావేశాలు పెడితే జ‌నం బెంబేలెత్తి పోతున్నార‌ని ఆరోపించారు న‌క్కా ఆనంద్ బాబు. త‌న తండ్రికి కార‌కుడు అంబానీ అంటూ ఆరోపించిన జ‌గ‌న్ రెడ్డి ఉన్న‌ట్టుండి ప‌రిమ‌ళ అంబానీకి ఎంపీగా ఎలా ఛాన్స్ ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.

Also Read : AP CM YS Jagan : క్రీడ‌లకు ఏపీ స‌ర్కార్ ప్ర‌యారిటీ

Leave A Reply

Your Email Id will not be published!