Patwari Jobs Scam : మధ్యప్రదేశ్ సర్కాప్ పై నిరసన
పట్వారీ రిక్రూట్ మెంట్ లో అవినీతి
Patwari Jobs Scam : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై మధ్య ప్రదేశ్ లో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంటోంది. సర్కార్ ఆధ్వర్యంలో తాజాగా పట్వారీ పోస్టుల(Patwari Jobs)కు సంబంధించి భర్తీ చేపట్టింది. ఇందులో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు.
వారంతా సీఎం చౌహాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇందులో ప్రధానంగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ప్రమేయం ఉందంటూ మండిపడ్డారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యతిరేంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. అవినీతికి కేరాఫ్ గా మారారంటూ సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే దళితులు, గిరిజనులు, బహుజన వర్గాల పట్ల బీజేపీ రాష్ట్ర సర్కార్ కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపించింది. మొత్తం పట్వారీ భర్తీ ప్రక్రియపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. దోషులు ఎవరో తేల్చాలని కోరింది.
Also Read : Revanth Reddy : రేవంత్ వ్యాఖ్యలు స్పందించని నేతలు