Purandeswari : పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు ఉంటుంది
Purandeswari : ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పొత్తులపై , రాబోయే ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీతో పొత్తు అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఉన్నట్టు గానే ఈసారి కూడా కలిసే సాగుతామని సంకేతం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ముందు నుంచి బీజేపీతో సఖ్యతతోనే ఉన్నారని చెప్పారు దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeswari). ఇవాళ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన యాక్షన్ ప్లాన్ ఏమిటో స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి రూ. 20 వేల కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తే ఇప్పటి వరకు కనీసం 30 శాతం కూడా పూర్తి కాలేదన్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. తాము రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా సరైన రీతిలో ఖర్చు పెట్టడం లేదన్నారు. ఇన్ని వేల కోట్లు ఇచ్చినా ఎందుకని ఖర్చు చేయలేదంటూ ప్రశ్నించారు పురంధేశ్వరి.
Also Read : Patwari Jobs Scam : మధ్యప్రదేశ్ సర్కాప్ పై నిరసన