హైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, లవ్లీ బ్యూటీ నయనతార , టీవీకే గణేష్ కీలక పాత్రలు పోషించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఈనెల 11న ప్రిమీయర్ షో ప్రదర్శించగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ మూవీ. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతోంది. 70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు ధీటుగా నటించడంతో సినిమా బిగ్ సక్సెస్ సాధించింది. అంతే కాదు తొలి రోజు ఏకంగా 84 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి కామెడీని పండించాడు. వినోదం ఉండేలా చూశాడు. మ్యూజిక్ పరంగా సినిమాకు బిగ్ అస్సెట్ గా మారింది. రాబోయే రోజులలో ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందో ఎవరూ చెప్పలేమని అంటున్నారు సినీ రంగం అనలిస్టులు.
ఇదిలా ఉండగా మంగళవారం మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ సక్సెస్ కావడంతో సంతోషాన్ని తట్టుకోలేక పోయింది తన కోడలు, ప్రముఖ వ్యాపారవేత్త, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల. ఉపాసన కొణిదెల సోషల్ మీడియా ద్వారా తన మామకి అభినందనలు తెలిపారు. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమె ఇలా రాశారు ఇది ఒక మెగా సంక్రాంతి అంటూ కితాబు ఇచ్చారు. కాగా సాహు గారపాటి , సుష్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకర వర ప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్స , రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఇతర పెద్ద తెలుగు చిత్రాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధం కావడం విశేషం.
