హైదరాబాద్ : కేరళ క్రికెట్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ కు అసలు ఏమైందని ఆవేదన చెందుతున్నారు లక్షలాది తన అభిమానులు. ఇండియన్ క్రికెట్ లో అత్యధిక జనాదరణ పొందిన క్రికెటర్లలో తను కూడా ఒకడు. ఒ వైపు అభిషేక్ శర్మ, ఇంకో వైపు ఇషాన్ కిషన్, వైభవ్ సూర్య వంశీ, సూర్య కుమార్ యాదవ్ లు దుమ్ము రేపుతుంటే తను మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి దాకా దేశీవాళి, ఐపీఎల్ టోర్నీలలో పరుగుల వరద పారించిన శాంసన్ ఇలా ఆడటం ఏమిటి అని వాపోతున్నారు. ఏరికోరి ఓపెనర్ గా పనికి వస్తాడని అనుకుంటే చేజేతులారా తన కెరీర్ ను పాడు చేసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో ఒత్తిళ్లను తట్టుకోలేక బీసీసీఐ సెలెక్షన్ కమిటీతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పనిగట్టుకుని సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇచ్చారు. కానీ తను అద్భుతమైన ఛాన్స్ ను పోగొట్టుకున్నాడు. ఫుట్ వర్క్ పూర్తిగా పక్కదారి పట్టింది. దీంతో కేవలం ఐదు మ్యాచ్ లలో తను 50 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈనెల 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా కలిసి ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు తుది జట్టుకు ఎంపికయ్యాడు. తన పేలవమైన ఆట తీరు కారణంగా ఫైనల్ టీంకు ఎంపికయ్యే అవకాశం లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా తనకు ఒక్కడు మాత్రమే మద్దతు పలికాడు. తను ఎవరో కాదు ప్రస్తుతం బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా. ఫామ్ అనేది తాత్కాలికమని, క్లాస్ అనేది శాశ్వతమని , సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటర్ అంటూ ప్రశంసలు కురిపించాడు.
