Congress Govt Shock : రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా
స్పష్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
Congress Govt : హైదరాబాద్ – కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్(Congress) సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వందలాది ఎకరాలు ఉన్న రైతులకు బిగ్ షాక్ తగిలింది. రైతు బంధుపై ఎన్నికల సందర్బంగా కీలక ప్రకటన చేశారు ప్రస్తుత సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
Congress Govt Shocking Decision
ఒక ఎకరం ఉన్న రైతు నుంచి బడా రైతులు కూడా రైతు బంధు పొందారు. ఇక్కడే పేదలకు తక్కువ లబ్ది చేకూరితే పెద్ద ఎత్తున లాభం పొందారు బడా బాబులు, భూ కబ్జాదారులు. ఇక నుంచి రైతు బంధు పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది సర్కార్.
రైతు బంధు వస్తున్న రైతులందరికీ ఇకపై ఆటోమేటిక్ గా రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందదని పేర్కొంది. రైతు భరోసా కోసం రాష్ట్రంలోని రైతులు అందరూ ప్రత్యేకంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 28 నుంచి వచ్చే జనవరి 6 వరకు ప్రజా పాలన కొనసాగుతుందని, ఇందులో తిరిగి దరఖాస్తు చేసుకుంటేనే రైతు బంధు వర్తిస్తుందని పేర్కొంది.
అయితే పెన్షన్ సౌకర్యం పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. కానీ రైతు భరోసా కింద డబ్బులు పొందాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందేనని వెల్లడించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
Also Read : TTD BOARD : జీయర్ మఠాలకు నిధులు పెంపు