#SarkariVariPata : ‘సర్కారి వారి పాట’ స్టోరీ ఇదేనా?

సింగిల్ లైన్ స్టోరీ అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు

Sarkari Vari Pata : సర్కారి వారి పాట..సినిమా టైటిల్ చాలా కొత్తగా వెరైటీగా ఉండి..టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వరుస సూపర్ హిట్లతో జోరు మీదున్న మహేష్ బాబు మొదట..వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్నారు. ఎందుకో మళ్లీ అది ట్రాక్ ఎక్కలేదు. నిజానికి వంశీ, మహేష్ రెండు కుటుంబాలు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కూడా ఉన్నాయి. అందువల్ల సినిమా మొదలవుతుంది అనుకున్నారు. అయితే వంశీ సినిమా మేకింగ్ అంతా చాలా క్లాసిక్ గా, స్టయిలిష్ గా ఉంటుంది. మాస్ కూడా చేశారు కానీ..ఊపిరి సినిమా నుంచి తన స్టయిల్ మారింది.

బహుశా మరి ఎక్కడ బెడిసికొట్టిందో తెలీదు..సడన్ గా అది ఆగిపోయి.. సర్కారువారి పాట పట్టాలెక్కింది. ఇంతకుముందు కూడా సుకుమార్ సినిమా చేస్తానని ముందు నుంచి చెప్పుకొచ్చి, సడన్ గా అది క్యాన్సిల్ చేసి.. ‘సరిలేరు నీకెవ్వరూ’ టేకప్ చేశారు. సంక్రాంతి ఊపులో లాభాల్లోకి వెళ్లిందిగానీ లేదంటే పెట్టిన పెట్టుబడి వచ్చేదని సినీ పండితుల విశ్లేషణ. ఈ దశలో అలాగే వంశీ తో సినిమా అని..సడన్ గా అది కాకుండా ‘సర్కారి వారి పాట’కు జెండా ఊపారు.

అయితే కథ విషయానికి వస్తే.. మహేష్ తల్లి ఒక బ్యాంకులో ఆఫీసరు..ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి బ్యాంకులో కోట్లరూపాయలు డ్రా చేసి..విదేశాలకు పారిపోయిన మోసగాడిని వెతికి చట్టానికి పట్టివ్వడానికి మహేష్ బయలుదేరుతాడు..ఇది సింగిల్ లైన్ కథ..బహుశా మహేష్ ఆస్తులను బ్యాంకు వేలం వేసే క్రమంలో.. సర్కారి వారి పాట అనే మాట వినిపించవచ్చు..అని కొందరంటున్నారు. ఇదండీ సంగతి..

 

Leave A Reply

Your Email Id will not be published!