Pallavi Prashanth : నేను ఎక్కడికీ పోలేదు
బిగ్ బాస్ విన్నర్ కామెంట్
Pallavi Prashanth : హైదరాబాద్ – బుల్లి తెరపై గత కొంత కాలంగా మోస్ట్ పాపులర్ రియాల్టీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్(Big Boss) షో ప్రస్తుతం తీవ్ర వివాదాలకు దారి తీసేలా చేసింది. ఫైనలిస్ట్ ప్రకటన సందర్భంగా చోటు చేసుకున్న రాద్దాంతం చివరకు బస్సులు, వాహనాలను ధ్వంసం చేసేంత దాకా వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు బిగ్ బాస్ షో ను నిషేధం విధించాలని కోరుతూ అరుణ్ అనే లాయర్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
Pallavi Prashanth Comment
ఇదే సమయంలో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు తొలిసారి సామాన్య రైతు కుటుంబానికి చెందిన పల్లవి ప్రశాంత్. ఇతడి స్వస్థలం తెలంగాణ లోని సంగారెడ్డి ప్రాంతం. విజేతగా నిలిచిన ప్రశాంత్ కు రూ . 35 లక్షల నగదు తో పాటు కారు, నెక్లెస్ ఇచ్చారు నిర్వాహకులు.
కారును తండ్రికి, నెక్లస్ ను తల్లికి ఇస్తున్నట్లు వేదిక పై నుంచే ప్రకటించాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. దీంతో తను పారి పోయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిపై బిగ్ బాస్ విన్నర్ స్పందించాడు. తాను ఇంట్లోనే ఉన్నానని, ఎక్కడికీ పారి పోలేదన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకు వెళ్లేందుకు తమ కుటుంబీకులను రమ్మంటూ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపించాడు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Naga Vamsi Producer : పుకార్లను నమ్మొద్దు – నిర్మాత