PM Modi Congratulate : కబడ్డీ టీంకు మోదీ కితాబు
42-32 తేడాతో ఇరాన్ పై గెలుపు
PM Modi Congratulate : ప్రతిష్టాత్మకమైన కబడ్డీ ఆసియా ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది భారత కబడ్డీ జట్టు. ప్రత్యర్థి జట్టు ఇరాన్ కబడ్డీ జట్టును ఫైనల్ లో 42-32 తేడాతో ఓడించింది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన భారత జట్టును అభినందనలతో ముంచెత్తారు.
అసాధారణమైన రీతిలో ప్రదర్శన చేశారని, ఇలాంటి స్పూర్తి దాయకమైన విజయం ఎందరికో ప్రేరణగా నిలుస్తుందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ(PM Modi). కలిసికట్టుగా ఆడితే ఎంతటి గెలుపునైనా సాధించవచ్చని మీరు నిరూపించారంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి విజయాలు మరిన్నిసాధించాలని భారత కబడ్డీ జట్టును ఆకాంక్షించారు.
వరుసగా ఆసియా కబడ్డీ ఛాంపియన్ గా నిలవడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు ప్రధాన మంత్రి. మరింత ముందుకు వెళ్లేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తుందని ఈ సందర్బంగా స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. తాము పవర్ లోకి వచ్చాక క్రీడా రంగానికి ప్రయారిటీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ప్రతిభ కలిగిన వారు ఉన్నారని వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు సాధించ వచ్చన్న నమ్మకం తనకు ఉందన్నారు.
Also Read : PM Modi : దేశాభివృద్దిలో సహకార రంగం కీలకం